Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా, కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందు తున్న మిస్టరీ థ్రిల్లర్ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' (ఎవరు, ఎక్కడ, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, 'సినిమా చూశాను. క్రిస్పీ నెరేషన్తో మంచి పెర్ఫార్మెన్స్లతో చాలా థ్రిల్లింగ్గా తెరకెక్కించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్ వరల్డ్లో వచ్చిన మార్పులను చక్కగా చూపించారు. అంతర్లీనంగా మంచి ప్రేమకథ కూడా ఉంది. ఇప్పటికే ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ మంచి చిత్రాన్ని మా ద్వారా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు.
'మా బ్యానర్లో రూపొందిన తొలి చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. ఇది మా ఫస్ట్సక్సెస్గా భావిస్తున్నాం. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ మూవీ ఇది. గుహన్ మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్దరూ మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారిద్దరి కెమిస్ట్రీ తప్పకుండా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం. కమర్షియల్గా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల చెప్పారు.
దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే డిఫరెంట్ సినిమా ఇది' అని తెలిపారు. ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో - ప్రొడ్యూసర్: విజరు ధరణ్ దాట్ల, సంగీతం: సైమన్ కె. కింగ్, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: నిఖిల్ హాసన్.