Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ ఫిల్మ్ '7 డేస్ 6 నైట్స్'. క్లిష్ట పరిస్థితుల మధ్య రికార్డ్ టైమ్లో ఈ సినిమా షూటింగ్ని చిత్ర బృందం పూర్తి చేసింది.
కరోనాకి సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, 100 మంది టీంతో, 4 కెమెరాలతో గోవా, మంగళూరు, ఉడుపిలో చివరి షెడ్యూల్ని పూర్తి చేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి, అతి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, 'అనుకున్న దానికంటే త్వరగా, అద్భుతంగా చిత్రం పూర్తయింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదల, క్రమశిక్షణతో పని చేసిన నా టీంకి చాలా థ్యాంక్స్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్కి ఈ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం రానుంది. మా అబ్బాయిని ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్తో హదయాన్ని హత్తుకునేలా మా సినిమా ఉంటుంది' అని తెలిపారు.
'నా కేరీర్లోనే బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుంది. మా నాన్నగారికి ఫిల్మ్ మేకింగ్ మీదున్న ప్యాషన్ నాకు చాలా స్పూర్తినిస్తుంది' అని హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ చెప్పారు. కో-ప్రొడ్యూసర్ జె. శ్రీనివాస రాజు మాట్లాడుతూ, 'దర్శకుడిగా 'డర్టీ హరి'తో బ్లాక్బాస్టర్ అందుకున్న 'ఎం.ఎస్.రాజు గారు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మరో సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ని అందించబోతున్నారు' అని అన్నారు. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ ఎం. అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు.