Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అప్పుడు-ఇప్పుడు'. యు.కె.ఫిలింస్ బ్యానర్పై ఉషారాణి కనుమూరి, విజయ రామకష్ణం రాజు నిర్మించారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవలే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేసిన సాంగ్కు, అలాగే పూరి జగన్నాథ్ విడుదల చేసిన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. శ్రీకాంత్, సునీల్ రిలీజ్ చేేసిన పాటలు కూడా మంచి హిట్గా నిలిచాయి. మా సినిమాకు మంచి సపోర్ట్ అందించిన వీరందరికీ కృతజ్ఞతలు. విశేష ఆదరణ పొందిన టీజర్తో ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అన్ని రకాల కమర్షియల్ హంగులు ఉన్న చిత్రమిది. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య పోషించిన పాత్రలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని సెప్టెంబర్ 3న రిలీజ్ చేేస్తున్నాం' అని తెలిపారు.
'మా సినిమా టీజర్, సాంగ్స్ మంచి పాపులర్ అయ్యాయి. ఇదొక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్. హీరో, హీరోయిన్లు కొత్తవారే అయినా చాలా బాగా నటించారు. మేకింగ్లో ఎక్కడా రాజీపడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా చిత్రాన్ని మంచి అసెట్స్ అవుతాయి' అని దర్శకుడు చలపతి పువ్వల అన్నారు.