Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయం అవుతూ ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'తమిళ హిట్ సినిమా 'ఒత్తు సెరుప్పు సైజ్ 7' కి ఇది రీమేక్. తమిళంలో ఆర్.పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. హీరో పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో బండ్ల గణేష్ హీరోగా పరిచయం అవడం మాకెంతో సంతోషాన్నిస్తోంది. ఆయన కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి బాగా కృషి చేస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్స్టాప్గా సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం. అలాగే 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చెన్నైలో ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమవడం విశేషం' అని చెప్పారు. ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.