Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం 'అద్భుతం'. మహా తేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై చంద్రశేఖర్ మోగుళ్ళ నిర్మిస్తున్న చిత్రమిది. మల్లిక్ రామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఊరేంటి పేరేంటి...' అంటూ సాగే పాట విడుదలైంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'తేజ, శివాని ఇద్దరూ ఈ పాటలో చాలా అందంగా ఉన్నారు. రధన్ సినిమాకు అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ ఎడిటర్. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి వినూత్న కథ అందించారు. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. అందర్నీ అలరించబోయే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని అన్నారు.