Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'జెమ్'. మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, 'మేం అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కిం చేందుకు మా నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్. మీ అందరికీ నచ్చుతుంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. విజయ్ రాజా యాక్టింగ్ హైలైట్గా నిలుస్తుంది. నక్షత్ర, రాశీ సింగ్ ఇద్దరూ బాగా నటించారు. మా సినిమాని ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.
'ఈ సినిమాలో విజయ్ రాజా యాక్టింగ్ ఆడియెన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది. మ్యూజిక్కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. నా బెస్ట్ వర్క్ ఇవ్వడానికి ప్రయత్నించా. ఈ సినిమా చూసి నేను ఎంజాయ్ చేశాను. నాలాగే ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీలవుతారని ఆశిస్తున్నాను' అని సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ చెప్పారు. హీరో విజయ్ రాజా మాట్లాడుతూ, 'ఈ సినిమాకి బ్యాక్బోన్ టెక్నీషియన్సే. అజరు, సంపూర్ణేష్ బాబు, రచ్చ రవి తదితరులు మా సినిమాలో నటించి, ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎప్పుడెప్పుడు మా సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశాను. ఈనెల 17న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం' అని అన్నారు. ''శశి', 'జెమ్' నా కెరీర్లో ఒకేసారి ప్రారంభమైన చిత్రాలు. 'జెమ్' అనిపించే సినిమా. విజయ్ ఫైట్స్, డాన్సులు బాగా చేశాడు. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్నీ అంశాలు ఉన్న చిత్రమిది. లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది' అని హీరోయిన్ రాశీ సింగ్ తెలిపారు.