Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర ముహూర్తపు షాట్కు చిరంజీవి క్లాప్నివ్వగా, బాలీవుడ్ కథానాయకుడు రణవీర్ సింగ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ శంకర్కు చిరంజీవి స్క్రిప్ట్ను అందించి, శుభాకాంక్షలు తెలిపారు.
'రామ్చరణ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రమిది. అలాగే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాతలు దిల్రాజు, శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 50వ చిత్రమిది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రూపొందనుంది. కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, అంజలి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: నరసింహారావు, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకష్ణ, మోనిక, రైటర్స్: సాయిమాధవ్ బుర్రా, వెంకటేశన్, వివేక్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, వివేక్, రచన - దర్శకత్వం: ఎస్.శంకర్.