Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎఫ్3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్లో శుక్రవారం ప్రారంభమైంది. చిత్ర తారాగణం అంతా పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీని మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఫుల్ జోష్తో సందడి చేయడం విశేషం.
'వెంకటేష్, వరుణ్తేజ్, అనిల్ రావిపూడి.. కాంబినేషన్లో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే శర వేగంగా సినిమాని పూర్తి చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ చేశారు. ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా, సినిమాకి తన గ్రాఫ్ని పెంచుకుంటూ మహేష్బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో కలెక్షన్ల వర్షం కురిపించారు. ఇక 'ఎఫ్ 2'తో నవ్వుల వర్షం కురిపించిన ఆయన ఈ సినిమాతో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారు. టాలీవుడ్లో సక్సెస్ఫుల్ బ్యానర్గా పేరొందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్లకు ప్రత్యేకమైన మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహరీన్లు వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు. 'ఎఫ్ 2' సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ కూడా మంచి హిట్టయ్యింది. అంతకు మించి అనేలా ఈ సినిమా కోసం స్పెషల్ ట్యూన్లను ఆయన సిద్దం చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్గా, తమ్మిరాజు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.