Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్ తాజాగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'. దేవ్ కట్టా దర్శకుడు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ పొందిందీ చిత్రం. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయ బోతున్నట్లు మేకర్స్ శనివారం ప్రకటిస్తూ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు.
'ఇప్పటి వరకు చేయనటువంటి ఓ సరికొత్త ఇంటెన్స్ పాత్రలో సాయితేజ్ను చూడబోతున్నారు. నేటి సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతూ అందరిలో ఆలోచన రేకెత్తించేలా ఈ సినిమా ఉంటుంది. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్, కాలేజ్ సాంగ్తో పాటు జోర్ సే.. సాంగ్కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయితేజ్ యాక్టింగ్, దేవ్ కట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్తో సర్వత్రా సినిమాపై అమితాసక్తి నెలకొంది. గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
సుబ్బరాజు, రాహుల్ రామకష్ణ, బాక్సర్ దిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: దేవ్ కట్టా, కిరణ్ జరు కుమార్, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, మ్యూజిక్: మణిశర్మ, ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్, జె.బి.ఎంటర్టైన్మెంట్స్, కథ, మాటలు, దర్శకత్వం: దేవ్ కట్టా.