Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్షిత్ అట్లూరి హీరోగా ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా 'శశివదనే'. కోమలి ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. ఇటీవల ఈ సినిమాని ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
''రేరు! రోజూ ఆ అమ్మాయి వెనుక తిరుగుతున్నావు. ఏదో ఒక రోజున నీకు పడుతుందని అనుకుందాం! కానీ, వాళ్ళింట్లో ఎలా ఒప్పిస్తావ్ రా?' - హీరోకి స్నేహితుడి ప్రశ్న. 'ఏముందిరా!? వాళ్ళ క్యాస్ట్ కాదనుకో? మన కులపోడు కాదంటారు. ఒకవేళ వాళ్ళ కులమే అయినా... మా స్థాయికి సరిపోలేదంటారు. కానీ, కులాన్నీ - స్థాయిని చూసి ప్రేమ పుట్టదు కదరా! ప్రేమించాలని డిసైడ్ అయ్యామంటే ఎన్ని వచ్చినా యుద్ధం చేయాలంతే' అని హీరో రక్షిత్ అట్లూరి సమాధానం. టీజర్లో సంభాషణలు, దశ్యాలు, 'కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు' అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను గోడపై చూపించడం ద్వారా సినిమాపై ఆసక్తి కలిగించాయి' అని చిత్ర బృందం తెలిపింది.
నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ, ' ఇదొక అందమైన, అర్థవంతమైన ప్రేమకథా చిత్రం. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్కు బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం. రక్షిత్, కోమలీ ప్రసాద్ జంట ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది' అని చెప్పారు.