Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంథని
మంథని బాలికల జూనియర్ కళాశాలను బాలుర కళాశాలలో కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ లో ధర్నా నిర్వహించారు. కళాశాల నుండి స్థానిక అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాతికేళ్లుగా నడుస్తున్న బాలికల కళాశాలలో బాలురలో కలపాలని ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. కేవలం బాలికల కోసమే ఉన్నందున తాము అందులో చదువుకుంటున్నమనీ, లేనిచో మా తల్లిదండ్రులు చదువు మానిపించే అవకాశాలున్నాయన్నారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని మానకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్ల సందీప్, సిపిఎం నాయకుడు బూడిద గణేష్, తదితరులు పాల్గొన్నారు.