Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతువర్మ జంటగా రూపొందుతున్న చిత్రం ఃవరుడు కావలెనుః. ఈ సినిమా ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఃకోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలాః, అలాగే ఃదిగు దిగు నాగః, ఃమనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ..ః పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. అలాగే ఫస్ట్లుక్, క్యారెక్టర్ పోస్టర్లకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ఎంతో ప్రాచుర్యం లభించింది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించటానికి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని చిత్ర దర్శక, నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారుః అని చిత్ర యూనిట్ తెలిపింది.
నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్య దేవర నాగవంశీ, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.