Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ చండ్ర మూవీస్ పతాకంపై చండ్ర మధు నిర్మించిన చిత్రం 'ఫాతిమా'. (ఫ్రమ్ పాకిస్తాన్ వయా చైనా అనేది క్యాప్షన్). తోట క్రిష్ణ దర్శకుడు. విజయ దశమి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత చండ్ర మధు మాట్లాడుతూ,'డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ టైటిల్, క్యాప్షన్తో ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నాయి. దసరా కానుకగా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అలాగే అదేరోజు మా శ్రేయోభిలాషి ప్రసాద్ రెడ్డి దర్శత్వంలో మరో చిత్రాన్ని మా బ్యానర్లో ప్రారంభించబోతున్నాం. ఆయన ఓ మంచి కథని రెడీ చేశారు' అని తెలిపారు.
దర్శకులు తోట క్రిష్ణ మాట్లాడుతూ, 'ఆర్టిస్టులు, టెక్నీషయన్లు అందరూ చాలా బాగా కోపరేట్ చేశారు. సినిమా ఇంత బాగా రావడానికి మా నిర్మాత మధు అభిరుచే కారణం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది' అని అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, ముత్యాల రాందాస్, మోహన్ వడ్లపట్ల, చంద్ర శేఖర్, ప్రసాద్ రెడ్డితో పాటుగా చిత్రంలో నటించిన సంహిత, భావన, మధురిమ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ చిత్రానికి కథా సహకారం : ఎ.చంద్రశేఖర్, మాటలు: నరేంద్ర, నరేన్ ఎల్లాప్రగడ, పాటలు: అప్పల ప్రసాద్, సంగీతం : ఘన శ్యామ్, ఎడిటింగ్:కళ్యాణ్ గాజా, ప్రసాద్, కెమెరా: ఆనంద్ మరుకుత్తి, సహ నిర్మాతలు: ప్రశాంతి రవి కె., కథ, నిర్మాత: చండ్ర మధు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కష్ణ తోట.