Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇదే మా కథ'. గురు పవన్ దర్శకుడు. శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లోనే తొలి రోడ్ జర్నీ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్బంగా హీరో సుమంత్ అశ్విన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ,
'ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్ గారికి, భూమికకి, హీరోయిన్కి, అజరు క్యారెక్టర్కీ ఓ గోల్ ఉంటుంది. అయితే వీరందరి కామన్
ఇష్టం మాత్రం బైక్ రైడింది. ఇలా వీళ్లంతా బయల్దేరి ఎక్కడ కలుసుకున్నారు,
ఆ జర్నీ అంతా ఏమైంది?, గోల్స్ రీచ్ అయ్యారా లేదా అనేది ఈ సినిమా. భిన్న వ్యక్తులు, భిన్న జీవితాలు, వారి కథలు..ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీలయ్యా. తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మంచి లొకేషన్స్,
కథలో రోల్స్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ ఇందులో ఉన్నాయి. సినిమా చివరి 20 నిమిషాల్లో స్నో మీద రైడ్, రేస్ ఆసక్తికరంగా ఉంటుంది. స్నో మీద బైక్ రైడింగ్ అంటే చాలా రిస్క్. అందుకే స్నో మీద చాలా ప్రాక్టీస్ చేసి షూటింగ్ చేశాం. భూమిక గారు కూడా చాలా డేర్ చేశారు. డూప్స్ పెట్టి చేయొచ్చు. కానీ రియలిస్టిక్గా ఉండేందుకు ఆమే చేశారు. 'ఒక్కడు' తర్వాత ఆవిడతో డైరెక్ట్ కాంటాక్ట్ ఇదే. ఆమెతో పనిచేయటం మరచిపోలేని అనూభూతి. డైరెక్టర్ గురు మంచి రైటర్. పక్కా కమర్షిల్ ఎలిమెంట్స్ని చాలా సహజంగా మలిచి సినిమాని రూపొందించారు. నా తదుపరి సినిమా '7 డేస్ 6 నైట్స్' షూటింగ్ కూడా పూర్తయ్యింది' అని చెప్పారు.