Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కుమార్తె, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా తెరకెక్కనుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు సుభాస్కరన్, మహవీర్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం '3'తో ఐశ్వర్య దర్శకురాలిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'వెరు రాజా వెరు' చేశారు. ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమాని తెలుగులో చేసేందుకు ఐశ్వర్య ఆర్.ధనుష్ సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా ఐశ్వర్య ఆర్.ధనుష్ మాట్లాడుతూ, 'లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పటికే పలు భారీ బడ్జెట్, హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. అక్షరు కుమార్ హీరోగా నటిస్తున్న 'రామ్ సేతు'తో హిందీ పరిశ్రమలోకీ ప్రవేశిస్తోంది. జాన్వీ కపూర్తో 'గుడ్ లక్ జెర్రీ' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగిడేందుకు సిద్ధమైంది. ఈ బ్యానర్ నిర్మిస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని దష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది' అని చెప్పారు. 'మా సంస్థలో తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకుంది' అని లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఆశిష్ సింగ్ అన్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు, పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.