Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కొండపొలం'. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈనెల 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను చిత్ర బృందం గ్రాండ్గా నిర్వహించింది.
ఈ సందర్భంగా నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ, 'లాక్డౌన్ సమయంలో ఈ కథ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఆర్థికంగా సాయం చేశారు. వారందరికీ థ్యాంక్స్. ఆల్ ఇండియా వైడ్గా రైట్స్ కొనేశారు. ఐదు నిమిషాల్లో డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ బిజినెస్ క్లోజ్ చేసేశారు. దీంతో పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసిందన్న కాన్ఫిడెంట్ వచ్చింది. ఆయనే ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. వరుణ్ తేజ్తో 'కంచె', వైష్ణవ్ తేజ్తో 'కొండపొలం' చేయటం చాలా హ్యాపీగా ఉంది. వైష్ణవ్ తేజ్ ఓ పెద్ద స్టార్ అవుతారు. క్రిష్ అద్భుతమైన చిత్రాల్లో 'కొండపొలం' కూడా ఒకటిగా నిలు స్తుంది' అని అన్నారు.
'పుస్తకాల షాపులు మూసేస్తున్నారు. సినిమాకు కావాల్సిన ముడి పదార్థం స్టోరీ. గొర్రెలను తీసుకుని అడవికి వెళ్తే అది పిక్నిక్ కాదు. అది సాహసయాత్ర.
'కొండపొలం' పుస్తకం చదివిన తరువాత, అందులో స్త్రీ పాత్ర లేదు. గొర్రెలు కాసేందుకు అడవికి వెళ్లిన కుర్రాడు, మళ్లీ అదే అడవిని కాపాడే అధికారిగా వస్తాడు. అలాంటి స్టోరీలో అందమైన ప్రేమకథను జోడించి తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్నాను. 'ఉప్పెన' సినిమాతో వైష్ణవ్ తేజ్కు బెంచ్ మార్క్ క్రియేట్ అయింది. అంతకంటే పై మెట్టు ఎక్కిస్తున్నాను. అలాంటి కథ, పాత్ర దొరికింది. ఓబులమ్మగా నటించిన రకుల్ తీరు, యాసతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కీరవాణి గారు మా గైడ్లా మారారు. సినిమా ఇంత బాగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఇది మనందరం గర్వపడే సినిమా' అని దర్శకుడు క్రిష్ చెప్పారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, 'ప్రతి నటికి గర్వంగా చెప్పుకునే పాత్ర ఒకటి ఉంటుంది. అలాంటి ఓ క్యారెక్టరే ఓబులమ్మ. ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు, ఆ నమ్మకాన్ని నాపై ఉంచినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్' అని తెలిపారు. 'అడవి పెద్దబాలశిక్ష అంటారు. 'ఉప్పెన' నా మొదటి చాప్టర్ అయితే, 'కొండపొలం' రెండోది. ఇందులో నేను పోషించిన క్యారెక్టర్ మనలో ఒకడు. ఎన్నో భయాలను, ఎన్నో కష్టాలను పడి, పులిని ఎదురించడమే ఈ కొండపొలం. ఓ స్టెప్ వేస్తే పడిపోతామనే భయం ఉంటుంది. కానీ ఎన్ని సార్లు పడ్డా కూడా ముందుకు వెళ్లాలనే బలాన్ని కొండపొలం ఇస్తుంది. మీరు ఈ దేశాన్ని గర్వపడేలా చేయాలని ఆలోచనను మీలో రేకెత్తిస్తుంది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు క్రిష్కి కృతజ్ఞతలు' అని హీరో వైష్ణవ్ తేజ్ అన్నారు.