Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామ్చరణ్
ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం 'నాట్యం'. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక శనివారం శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కథానాయకుడు రామ్చరణ్ మాట్లాడుతూ,'ఈ సినిమా చూశాను. మొదటి క్షణం నుంచి ఆఖరి నిమిషం వరకు ఎంతో అద్భుతంగా ఉంది. ఇండిస్టీ హిట్ సినిమాలను కూడా చూస్తూ మధ్యలో పడుకుంటాను. అలాంటిది 'నాట్యం' సినిమాను ఎంతో ఆసక్తిగా చూశాను. అన్ని కోణాల్లో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలు చాలా బాగా ఉన్నాయి. శ్రవణ్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రాణం పెట్టి, కథను అర్థం చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు. ఇదే స్టేజ్లో సంధ్యా రాజు దాదాపు ఏడేళ్ల క్రితం కూచిపూడి పర్ఫామెన్స్ చేశారు. కూచిపూడి నాట్యం, ఇలాంటి కల్చర్ మీద సినిమా తీస్తున్నారని సాయం చేసేందుకు వచ్చాను. స్త్రీ శక్తి అంటే ఏంటో ఈ సినిమాతో చూడబోతోన్నారు. సంధ్యా రాజు సంకల్పం కోసం ఈ సినిమాని మనం చూడాలి' అని చెప్పారు. డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ, 'మంచి సినిమా తీయడం కోసం ఇన్నేళ్లు ఎదురుచూశాను. మంచి తెలుగు సినిమా ఇది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని నాకు చాలా భయంగా ఉంది. కానీ ఇలాంటి వాటిని ఆదరిస్తే, మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి' అని తెలిపారు.
'రామ్ చరణ్గారు ఈ ఈవెంట్కు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గత పదేళ్లుగా ఆయన నాకు సాయం చేస్తూనే ఉన్నారు. ఆయనకెంతో రుణపడి ఉంటాను. మంచి మ్యూజిక్ ఇచ్చిన శ్రవణ్కి థ్యాంక్స్. కరుణాకర్ అద్భుతంగా పాటలు రాశారు. ఓ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని సంధ్యా రాజు చెప్పారు.