Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం 'నాట్యం'. రేవంత్ కోరుకొండ దర్శకుడు. నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రేవంత్ కోరుకొండ సోమవారం మీడియాతో మాట్లాడుతూ,'ఇది గురువు కలను నెరవేర్చే శిష్యురాలి కథ. గురువు అనుకున్న కథను ఆ శిష్యురాలు 'నాట్యం' ద్వారా ఎలా చెప్పింది?, ఊర్లోని మూఢనమ్మకాలను ఎలా పోగొట్టింది అనేది కథ. నాట్యం నేపథ్యం.. ఓ ఊరు, ఊర్లో గొడవలు, కొన్ని పాత్రలను అల్లి ఓ కథగా రాసి, వెండితెరపై ఆవిష్కరించాం. కమర్షియల్ డ్రామా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. అన్ని ఎమోషన్స్, సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. కెమెరామెన్, ఎడిటర్, డైరెక్టర్గా నేను పని చేయడంతో సినిమా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. సంధ్యా రాజు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. ఈ సినిమా ఇంత రిచ్గా రావడానికి నిర్మాతగానే కాకుండా టెక్నీషియన్గా, నటిగా ఎంతో సపోర్ట్ చేశారు. నా మొదటి సినిమా అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని, డిఫరెంట్ సబ్జెక్ట్తో రావాలని అనుకున్నా. అందుకే కె.విశ్వనాథ్ గారిలా ఓ క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమా తీశా. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ క్లాసికల్ డ్యాన్స్కు సరిపోయే సంగీతాన్ని అందించారు. రామ్ చరణ్ లాంటి వారు మా సినిమా ఈవెంట్కు రావడం మా అదష్టం. సినిమా చూశాకే ఈవెంట్కు వస్తానన్నారు. సినిమా చూసి మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ప్రోత్సహించారు' అని తెలిపారు.