Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కిన చిత్రం 'వరుడు కావలెను'. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ చిత్ర ట్రైలర్ను ముఖ్య అతిథిగా హాజరైన రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమాకి హీరో ఎవరనేది చెప్పకపోయినా టైటిల్ని బట్టి నాగశౌర్య హీరో అని ఈజీగా చెప్పొచ్చు. ట్రైలర్ చాలా బావుంది. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్ బ్యాక్ అవ్వాలి' అని చెప్పారు.
''చలో ' సక్సెస్ పార్టీలో సౌజన్య వచ్చి 'తమ్ముడు నీకో కథ చెబుతా చేస్తావా' అని అడిగింది. కథ వినగానే సూపర్హిట్ అని ఫిక్స్ అయ్యా. మొదట చిన్న సినిమాగా అనుకున్నాం. సితార బ్యానర్ తోడవ్వడంతో సినిమా స్థాయి పెరిగింది. చినబాబు, నాగవంశీ గారు ఫలానా హీరోకి ఇంతే బడ్జెట్ పెట్టాలనుకునే నిర్మాతలు కారు. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. తెరపై ఆర్టిస్ట్లంతా ఫ్రెష్గా కనిపించడానికి కారణం డైలాగ్లు. గణేష్ రావూరి చక్కని సంభాషణలు రాశారు. డిఓపీ వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనానికి నాతో నేనే లవ్లో పడిపోయా. విశాల్ చంద్రశేఖర్ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజన్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. రీతు చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. మంచి కథతో ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా' అని హీరో నాగశౌర్య అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, 'మా సంస్థ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మీదే ఎక్కువ దష్టి పెడుతుంది. మాకు అవే బాగా కలిసొచ్చాయి. ఇది కూడా ఫ్యామిలీ, కమర్షియల్ సినిమా. సెకెండాఫ్లో ఒక సస్పెన్స్ ఉంది. అది యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది' అని చెప్పారు. 'ఇది కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా' దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెలిపారు. 'ఈ చిత్రంలో 'కోల కళ్లే ఇలా' పాట రాశాను. అద్భుతంగా సిద్ శ్రీరామ్ ఈ పాటని పాడారు. ఈ పాటలో నాగశౌర్య, రీతు చాలా గ్లామర్గా కనిపిస్తారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్తో మ్యాజిక్ చేశారు' అని గీత రచయిత రాంబాబు చెప్పారు. సప్తగిరి మాట్లాడుతూ, 'నా కామెడీని మిస్ అయిన అందరినీ నవ్వులతో చీల్చి చెండాడుతా. సెకెండాఫ్లో మస్తు వినోదం ఉంటుంది' అని చెప్పారు. 'మంచి పాటలు కుదిరాయి. తమన్ సంగీతం అందించిన రెండు పాటలూ నాకు నచ్చాయి. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది' అని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ తెలిపారు.
'భూమిలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఆకాష్లాంటి అబ్బాయి కావాలి. ఈ చిత్రంలో మా హీరో, హీరోయిన్ల పాత్రలు అంత ప్లజెంట్గా ఉంటాయి. ఫన్, ఎమోషన్స్, అద్భుతమైన సంగీతం.. ఇలా అన్ని ఉన్న చిత్రమిది. నాగశౌర్య కథ వినగానే బ్లాక్బస్టర్ అవుతుందని చెప్పారు. బయటి టాక్ కూడా అలాగే వినిపిస్తోంది. రీతువర్మ ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది. నదియా పాత్ర సినిమాకి చాలా కీలకం. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కతజ్ఞతలు.
- రచయిత గణేష్ రావూరి