Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. 'ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. హీరో, హీరోయిన్స్పై మంచి రొమాంటిక్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్గా నిలవనుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. హీరో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న ఆది ఈ పోస్టర్లో నెవర్ బిఫోర్ అనే రేంజ్లో కనిపించించారు. పాయల్ రాజ్పుత్ పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాలకు భిన్నంగా, ఇది వరకు చూడని సరికొత్త క్యారెక్టరైజేషన్తో అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకోనుంది. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది' అని చిత్ర బృందం తెలిపింది. సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తిరుమల రెడ్డి, మ్యూజిక్ : సాయి కార్తీక్, ఎడిటర్ : మణికాంత్, సినిమాటోగ్రాఫర్: బాల్రెడ్డి.