Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విదార్థ్, ధవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం 'భగత్ సింగ్ నగర్'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రమేష్ ఉడత్తు, వాలాజా గౌరి మాట్లాడుతూ,'దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. మన దేశంలోకి అడుగుపెట్టిన బ్రిటీష్ వాళ్ళు, ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న కలను చెదరగొట్టి, వారిని, వారి సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి, చిరు ప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్. అలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా తీసినందుకు మా కెంతో గర్వంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్కు వెళ్లబోతున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.
'బెనర్జీ గారి సహకారంతో లెజండరీ ప్రకాష్రాజ్ గారు మా చిత్ర టీజర్ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అప్పటి నుండి మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. భగత్ సింగ్ రాసిన ఒక లైన్ను ఆదర్శంగా తీసుకుని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో, సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో, రియాలిటీకి దగ్గరగా, వినూత్న స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. భగత్ సింగ్ నగర్లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మంచి కంటెంట్తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను' అని దర్శకుడు చిత్ర వాలాజా క్రాంతి తెలిపారు.