Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో రాజశేఖర్ తండ్రి వరద రాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్నై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదరాజన్ గోపాల్కు హీరో రాజశేఖర్ రెండో సంతానం. శుక్రవారం ఉదయం వరద రాజన్ గోపాల్ భౌతికకాయాన్ని చెన్నైకి తరలించారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.