Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వాస్తవ ఘటనల ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. బాలకష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు.
'దర్శకుడు గోపీచంద్ మలినేనితో శ్రుతి హాసన్కు ఇది మూడో సినిమా కాగా, బాలకష్ణకి జోడీగా శ్రుతిహాసన్ మొదటిసారిగా నటించబోతున్నారు. పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో మేకర్స్ వెెల్లడించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. బాలకష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సంగీతం : తమన్.ఎస్, డైరెక్టర్ : గోపీచంద్ మలినేని.