Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిిరణ్, ఇనయ సుల్తానా హీరో, హీరోయిన్లుగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్ అయ్యంగార్, లోహిత్ కుమార్, మాస్టర్ భువన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ జక్కాల దర్శకుడు. ప్రొడక్షన్ నెం-1గా లక్ష్మి ప్రసన్న భూమి నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారం ఫిలించాంబర్లో వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన 'మా' ఈసీ మెంబర్ విష్ణు బొప్పన తొలి షాట్కి కెమెరా స్విచాన్ చేయగా, రచయిత ప్రసన్న కుమార్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఆరంభ పూజలో తోట ప్రసాద్, సాయి వెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో మా అబ్బాయి మాస్టర్ భువన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైన్ చిత్రమిది. ఈ చిత్రం ద్వారా చాలా మంది నూతన కళాకారులను పరిచయం చేస్తున్నాం' అని అన్నారు. 'ఫోన్లోనే ఈ సినిమాని నిర్మాత ఓకే చేశారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. నవంబర్, డిసెంబర్లో రెగ్యులర్ చిత్రీకరణ చేస్తాం. ఫిబ్రవరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని దర్శకుడు రమేష్ జక్కాల తెలిపారు.