Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం 'కురుప్'. శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించారు. శోభిత ధూళిపాళ్ల కథానాయిక. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈనెల 12న విడుదల కానుంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కథానాయిక శోభిత ధూళిపాళ్ల మాట్లాడుతూ, 'ఈ సినిమా రెండేళ్ల క్రితం పూర్తయింది. ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అని భయపడ్డాం. కానీ ఇప్పుడు ఇలా ఇన్ని భాషల్లో, ఇంత పెద్ద ఎత్తున విడుదల చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. ఈ సినిమా కచ్చితంగా మీ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది' అని చెప్పారు.
'ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. టీజర్, ట్రైలర్లో మీరు చూసింది కేవలం ఒక్క శాతమే. సినిమా చూసే వాళ్లు కచ్చితంగా అద్బుతమైన అనుభూతికి లోనవుతారు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ ఐడియా. అందుకే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. అన్ని భాషల ప్రేక్షకుల కంటే తెలుగు ఆడియెన్స్ సినిమాలను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. నేను త్వరలోనే తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తాను. హను రాఘవపూడి, వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుంది. పూర్తి తెలుగు చిత్రంగా ఉండాలని నేనే డబ్బింగ్ చెప్పాను. మీరు సినిమాను కచ్చితంగా ఎంజారు చేస్తారని నమ్ముతున్నాను. మీ ఫీడ్ బ్యాక్ వినేందుకు నేను ఎదురుచూస్తుంటాను' అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. ఈ వేడుకలో కథా రచయిత విన్ని విశ్వ, హీరో భరత్, నిర్మాత లగడపాటి శ్రీధర్, సంజరు, నిర్మాత రోహిత్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.