Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'దశ్యం 2'. 'దశ్యం' చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ఈ సినిమా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో మీనా, నదియ, నరేష్, కతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్, మ్యాక్స్ మూవీస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో డైరెక్ట్గా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధులు మాట్లాడుతూ, 'మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 240 దేశాల్లో ఉన్న ప్రైమ్ మెంబర్స్ ఈనెల 25న 'దశ్యం 2' సినిమాను చూడబోతున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ 'దశ్యం' చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది.
ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?, కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది?, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు?, ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఇలా.. కథలో ప్రతీ మలుపు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేలా కథనం ఉంటుంది. వెంకటేష్ వంటి అగ్ర హీరో నటించిన ఈ చిత్రాన్ని మా అమెజాన్ సంస్థ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపారు.