Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బ్లాక్ అండ్ వైట్', 'ప్రియుడు' సినిమాలతో నిర్మాతగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఉదరు కిరణ్. తాజాగా హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఆయన 'ఛలో ప్రేమిద్దాం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాయి రోనక్, నేహ సోలంకి జంటగా సురేష్ శేఖర్ రేపల్లె దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఉదరు కుమార్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో శనివారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నిర్మాత ఉదరు కిరణ్ మాట్లాడుతూ,'సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల సినిమా చూశాక, టీమ్ అంతా సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. ప్రజెంట్ ట్రెండ్కు కనెక్టయ్యే అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ఇందులో మంచి లవ్ స్టోరి ఉంది. అన్నింటికి మించి థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా చాలా రిచ్గా తీశాం. భీమ్స్ అద్భుతమైన పాటలు ఇవ్వడంతో దుబాయ్ లో మూడు పాటలను చిత్రీకరించాం. ఈ నెల 19న దాదాపు 200 థియేటర్స్లో సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.
'ఈ చిత్రంలో పంచ భూతాల్లాంటి ఐదు పాటలున్నాయి. 'ఎమ్బిఏ ఎమ్ సిఏ' అనే కాలేజ్ పెప్పీ సాంగ్ ఇటీవల ఆదిత్య ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ లభించింది. భీమ్స్ అంటే ఇప్పటి వరకు అందరూ మాస్ సాంగ్స్ అనుకునే వారు. కానీ, ఈ సినిమాతో భీమ్స్ మాస్తో పాటు, మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా చేయగలడని ప్రూవ్ చేసే విధంగా పాటలుంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని భీమ్స్ చేయగలడా? అని అనుకునే వారికి కూడా ఈ సినిమా మంచి సమాధానం చెబుతుంది. ప్రస్తుతం రవితేజ 'ధమాకా' చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నా. ఈనెల 19న నేను సంగీతం అందించిన ఈ సినిమాతోపాటు 'ఊరికి ఉత్తరానా', 'రామ్ అసుర', చిత్రాలు విడుదలవుతున్నాయి' అని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్నారు.