Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్షా నర్రా హీరోగా నటించిన చిత్రం 'మిస్సింగ్'. బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. శ్రీని జోస్యుల దర్శకుడు. ఈనెల 19న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా నాయికలు మిషా నారంగ్, నికీషా రంగ్వాలా మీడియాతో ముచ్చటించారు. హీరోయిన్ నికీషా రంగ్వాలా మాట్లాడుతూ, 'ఇందులో శతి అనే క్యారెక్టర్లో నటించాను. ఈ సినిమాలో మిస్ అయ్యేది నేనే. ఎందుకు మిస్ అయ్యాను అనేది తెరపైనే చూడాలి (నవ్వుతూ). ఎంగేజింగ్ థ్రిల్లర్గా మిమ్మల్ని మెప్పిస్తుంది' అని చెప్పారు. 'మీనా అనే జర్నలిస్ట్ క్యారెక్టర్లో కనిపిస్తాను. దర్శకుడు చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారు. ఇదొక మంచి థ్రిల్లర్ మూవీ' అని మరో నాయిక మిషా నారంగ్ చెప్పారు.