Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మిస్సింగ్' చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు హర్షా నర్రా. బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయికలు. శ్రీని జోస్యుల దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరో హర్ష నర్రా మాట్లాడుతూ, ''ఆకాశమంత ప్రేమ' అనే షార్ట్ ఫిలిం, అలాగే నిహారిక నిర్మించిన 'ముద్దపప్పు ఆవకారు' వెబ్ సిరీస్ చేశా. 'పెళ్లి గోల' వెబ్ సిరీస్తో నాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత దర్శకుడు శ్రీని ఈ సినిమాకి హీరోగా సెలెక్ట్ చేశారు. ఒక రేర్ అటెంప్ట్ చేయాలని ఇలాంటి ప్రాజెక్ట్ని తొలి చిత్రంగా ఎంచుకున్నాను. ఇందులో గౌతమ్ అనే క్యారెక్టర్ని పోషించాను. డిఫరెంట్ లేయర్డ్ స్టోరీ. దర్శకుడు శ్రీని చాలా స్పష్టతతో ఈ సినిమా చేశారు. రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నా కోసం మా నాన్నగారు ఈ సినిమా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు. త్వరలోనే కొత్త సినిమాని ఎనౌన్స్ చేస్తా' అని చెప్పారు.