Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా రామ్మల్లిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అద్భుతం'. చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. నేడు (శుక్రవారం) డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా హీరో తేజ సజ్జ మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న నా 3వ చిత్రం ఇది. యూనివర్సల్ ప్రాబ్లమ్ వల్ల హీరో, హీరోయిన్కి ఒకే ఫోన్ నెంబరు వస్తుంది. దీంతో ఏం జరిగింది?, వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఎటువంటి పరిస్థితులకు దారి తీసింది వంటి అనేక ఆసక్తికర అంశాల సమాహారంగా ఈ సినిమా ఉంటుంది. కథ చాలా ఫ్రెష్గా, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇలాంటి టిఫికల్ సబ్జెక్ట్ను దర్శకుడు నిజంగానే 'అద్భుతం'గా డీల్ చేశారు. ప్రేక్షకుల ఊహలను, అంచనాలను తలకిందులు చేస్తూ ఎక్కువ ట్విస్ట్లు, టర్నింగ్లు ఉన్న ఎంగేజింగ్ కథ ఇది. సినిమాల ఎంపిక విషయానికొస్తే, ఎప్పుడూ కథకే నా ప్రాధాన్యం. ఆడియెన్స్కు ఒక ఇంట్రస్ట్ క్రియేట్ చేసేలా కొత్త, కొత్త జోనర్లను ఎంచుకుంటున్నాను. అలాగే నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకత కోసం నిరంతరం శాయశక్తులా కృషి చేస్తున్నాను' అని చెప్పారు.