Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్తేజ్, రేఖ ఇందుకూరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అడవి దొంగ'. పర్నిక ఆర్ట్స్ బ్యానర్పై కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో నిర్మాత గోపీకష్ణ నిర్మిస్తున్న చిత్రమిది. గురువారం ప్రసాద్ల్యాబ్లో జరిగిన ఓ ఈవెంట్లో దర్శకుడు వీరశంకర్, నిర్మాత ఆరా మస్తాన్ ట్రైలర్ను విడుదల చేసి చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ కోటప్రోలు మాట్లాడుతూ, 'ఫారెస్ట్, ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అన్ని కమర్షియల్ హంగులతో, రియాలిటీకి దగ్గరగా ఈ చిత్రాన్ని రూపొందించాం' అని చెప్పారు.
'ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. షూటింగ్లో నా కాలు విరిగిపోయినా సరే డైరెక్టర్ పని చేయించాడు. ఆయన పని రాక్షసుడు. అందుకే సినిమా చాలా రిచ్గా వచ్చింది' అని హీరో రామ్తేజ్ తెలిపారు. నిర్మాత గోపీకష్ణ మాట్లాడుతూ, 'ఈ సినిమా అనుకున్నప్పుడు చిన్న సినిమా, చిన్న టీమ్ సరిపోతుంది అనుకున్నాం. కానీ ఇందులో నటించిన వారు, సాంకేతిక నిపుణులందరూ కసిగా పని చేసి, పెద్ద సినిమాని చేశారు. మంచి అవుట్ఫుట్ ఇచ్చారు. సినిమా చూసే ప్రేక్షకులూ థ్రిల్ అయ్యేలా చాలా నేచురల్గా సినిమా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం' అని తెలిపారు.