Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయకా నాయికలుగా తెరకెక్కిన చిత్రం 'మిస్సింగ్'. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీని జోస్యుల మీడియాతో మాట్లాడుతూ, 'ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అబద్ధంతో కథ మొదలుపెట్టి, సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సినిమా సాగుతుంది. జీఏ2 ద్వారా బన్నీ వాస్ గారు మాకు థియేటర్స్ సపోర్ట్ చేశారు. నైజాంలో ఏషియన్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మల్టీప్లెక్సులు కలిపి మంచి నెంబర్ థియేటర్స్ పడుతున్నాయి. నిన్న ప్రెస్ షో వేశాం. మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది' అని చెప్పారు.
'హర్ష, శ్రీని, నేను.. ఫ్రెండ్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఈ మూవీకి నా కంప్లీట్ ఎఫర్ట్ పెట్టాను. ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ కాబట్టి ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా. ఎన్నో ఓటీటీ ఆఫర్స్ వచ్చినా ఇవ్వలేదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, టర్నింగ్స్తో ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్ అన్నారు.