Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైరాజ్ జల్లూరి, ప్రవీణ్ పోతురాజు, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్, సుజాత, భరత్, చందు నటీనటులుగా తెరకెక్కు తున్న చిత్రం 'మల్లెతీగ'. శ్రీ నందనం క్రియేషన్స్ పతాకంపై పల్లి మోహన్ రావు దర్శకత్వంలో శ్రీను మోచర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సముద్ర హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు క్లాప్ ఇచ్చారు. నిర్మాత శ్రీను మోచర్ల దర్శకుడి చేతుల మీదుగా స్క్రిప్ట్ను అందుకోగా, నటుడు, నిర్మాత డి.యస్.రావు ఈ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డి.యస్.రావు మాట్లాడుతూ, 'అంతా కొత్త వాళ్లతో విలేజ్ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని అన్నారు. 'ఈ చిత్ర మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రం 'ఎర్ర మల్లెలు' అంత పెద్ద హిట్ అవ్వాలి. మంచి కథని సెలెక్ట్ చేసుకుని దర్శక,నిర్మాతలు చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి' అని దర్శకుడు సముద్ర చెప్పారు.
నిర్మాత శ్రీను మోచర్ల మాట్లాడుతూ,'దర్శకుడు చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించింది. ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక విలేజ్లో చిత్రీకరణ చేస్తాం. అంతా కొత్తవారితో చేస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని అన్నారు. 'దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథే హీరో. వైజాగ్ దగ్గర గుడివాడ పరిసర ప్రాంతంలో ఉన్న ఓ విలేజ్ ఎక్కడా మ్యాప్లో కూడా లేదు. గవర్నమెంట్ అండర్లో లేని ఈ విలేజ్కు సెట్ కూడా అవసరం లేదు. పూర్తి ట్రైబల్లో ఉన్న ఈ విలేజ్ను సెలెక్ట్ చేసుకుని, షూటింగ్ చేయబోతున్నాం. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాత శ్రీను మోచర్లకి కతజ్ఞతలు' అని దర్శకుడు దర్శకుడు పల్లి మోహన్రావు చెప్పారు. హీరో ప్రవీణ్ పోతురాజు మాట్లాడుతూ, ''జనసేన' తర్వాత చేస్తున్న మంచి సినిమా ఇది' అని తెలిపారు. 'మా లాంటి కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ మంచి కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు' అని మరో హీరో జై రాజ్ జల్లూరి, కథానాయికలు సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్, సుజాత అన్నారు.