Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'రాజ రాజ చోర'. నూతన దర్శకుడు హసిత్గోలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ అర్గ్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
వెండితెరపై మెరిసి ప్రేక్షకుల్ని కితకితలు పెట్టిన ఈ చిత్రం ఇకపై బుల్లితెర ప్రేక్షకుల్నీ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. శ్రీ విష్ణు నటించిన ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జీ తెలుగు ఈనెల 21న ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా జీ తెలుగు ప్రతినిధులు మాట్లాడుతూ, 'తన అభిమానులకు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను, వినోదభరిత చిత్రాలను అందించడంలో జీ తెలుగు ఎప్పుడూ ముందుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగా మరో ఫుల్లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ 'రాజ రాజ చోర' చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయనుంది. భాస్కర్ (శ్రీ విష్ణు) ఒక జిరాక్స్ షాప్లో పని చేస్తుంటాడు. అతను సంజనా (మేఘా ఆకాష్)తో ప్రేమలో పడతాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని చెప్పుకుని ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. అయితే అదే టైమ్లో భాస్కర్కి ఇదివరకే పెళ్ళై, అతనికొక కొడుకు ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడే భాస్కర్ జీవితంలోకి సంజనా మామయ్య విలియం రెడ్డి (రవి బాబు) ఎంట్రీ ఇస్తాడు. విలియం ఒక తప్పుడు పోలీస్ ఆఫీసర్. తన ఉద్యోగం కాపాడుకోవడానికి భాస్కర్ని ఇరికిస్తాడు. చివరకు భాస్కర్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది?, ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వంటి తదితర విషయాలకు సమాధానం కోసం ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు చూడాల్సిందే' అని చెప్పారు.