Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'భగత్సింగ్ నగర్'. వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ బాషల్లో ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాలోని 'యుగ యుగమైనా.. తరగని వేదన' అంటూ సాగే పల్లవిగల పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు మాట్లాడుతూ, 'ఇంతకు ముందు మేం విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా చిత్ర యూనిట్ సమక్షంలో 'యుగ యుగమైనా..' పాటను విడుదల చేశాం. ప్రొడ్యూసర్లగా మాకు ఇంత మంచి టీమ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్, ఆర్టిస్టులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్లో, కమిట్మెంట్తో, చాలా ఇష్టపడి ఈ సినిమా చేశారు. మేం లండన్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ తెలియజేస్తున్న దర్శకుడికి ధన్యవాదాలు. గత రెండు పాటల్లాగే ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
'ఇండిస్టీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎంతో ఆవసరం. మాలాంటి కొత్తవారికి అవకాశం కల్పించడంతోపాటు స్వేచ్ఛనిచ్చే నిర్మాతలు దొరకడం అదష్టంగా భావిస్తున్నా. షూటింగ్ కోసం ఏది అడిగినా కాదనకుండా వెంటనే మాకు సమకూర్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఓ డిఫరెంట్ పాయింట్తో రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని దర్శకుడు వాలాజా క్రాంతి తెలిపారు.
బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజరు గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, నత్యం : ప్రేమ్-గోపి, నేపథ సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి, ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.