Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త తరహా కథలు, కాన్సెప్ట్లతో ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన హీరో గౌతమ్. ఆయన హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సజన్ యరబోలు నిర్మించనున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఎస్ ఒరిజినల్స్ నిర్మాణంలో పదో సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. సర్వైవల్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ను ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతుండటం విశేషం. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్ కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఎర్పడినప్పుడు ఎలా వాటిని అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది. వైవిధ్యమైన కథలకు ప్రయారిటీ ఇచ్చే హీరో గౌతమ్ పాత్ర చాలా భిన్నంగా ఉండనుంది. ఈ చిత్రానికి సంబంధించి మిగిలిన వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు' అని తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మోహన్, మ్యూజిక్ : శ్రీరామ్ మద్దూరి, ఎడిటర్ : కె. సంతోష్, ప్రొడ్యూసర్ : సజన్ యరబోలు, రచన - దర్శకత్వం : సుబ్బు చెరుకూరి.