Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాన్ వరల్డ్ లెవల్లో ఇప్పుడు ట్రెండ్లో ఉన్న జోనర్ ఫోక్లోర్. తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సష్టించుకున్న చరిత్ర ఆయన సొంతం. ఆయన ఎవరితో సినిమాలు చేసినప్పటికీ... ఆ సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలనే సంకల్పంతో సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ 'జై విఠలాచార్య' పేరుతో ఓ పుస్తకం రాశారు. 'మూవీ వాల్యూమ్' షేక్ జిలాన్ బాషా ప్రచురిస్తున్న ఈ పుస్తకం ఫస్ట్ లుక్ని నటన శేఖర కష్ణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, ''విఠలాచార్య గారి దర్శకత్వంలో నేను ఒకే ఒక్క సినిమా చేశాను. అది 'ఇద్దరు మొనగాళ్లు'. ఆ సినిమా హిట్ అయ్యింది. కాంతారావు హీరోగా ఆయన చాలా జానపద సినిమాలు చేశారు. నేను జానపద నేపథ్యంలో చేసిన సినిమాలు చాలా తక్కువ. 'ఇద్దరు మొనగాళ్లు' కాకుండా 'మహాబలుడు', 'బొమ్మలు చెప్పిన కథ', 'సింహాసనం' సినిమాలు చేశాను. విఠలాచార్య గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే, సక్సెస్ఫుల్ నిర్మాతగా ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అనుకున్న బడ్జెట్లో చాలా ఫాస్ట్గా సినిమాలు తీసేవారు. అంతటి గొప్ప వ్యక్తి విఠలాచార్యగారిపై పుస్తకం తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది' అని అన్నారు.
'మూవీ వాల్యూమ్' షేక్ జిలాన్ బాషా మాట్లాడుతూ, 'నేను 13 ఏండ్లుగా సినిమా జర్నలిస్టుగా ఉన్నాను. మూవీ వాల్యూమ్ పేరుతో ఒక వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాను. ఇప్పుడు పబ్లిషింగ్ రంగంలో ప్రవేశించాను. సక్సెస్ ఫుల్ రైటర్ పులగం చిన్నారాయణ రాసిన తొమ్మిదో పుస్తకం 'జై విఠలాచార్య'ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం ఆనందంగా ఉంది. కష్ణగారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా బుక్ ఫస్ట్లుక్ విడుదల చేయడం ముదావహం. డిసెంబర్ నుంచి 'జై విఠలాచార్య'ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మాకు అన్ని విధాలుగా సహకారం అందించిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావుగారికి కృతజ్ఞతలు' అని తెలిపారు.
జానపద బహ్మ విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం 'జై విఠలాచార్య'. విఠలాచార్య గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నిర్మాత కూడా. తక్కువ బడ్జెట్, తక్కువ లొకేషన్లలో వేగంగా, పొదుపుగా సినిమాని ఎలా తీయవచ్చనేది ఆయన ఆచరించి చూపించారు. సినిమా నిర్మాణంలో ఆయన పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేశాం. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది.
- పులగం చిన్నారాయణ