Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'పుష్పక విమానం'. ఈ సినిమా ఇటీవల విడుదలై హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలాగే బాక్సాఫీస్ వద్ద నికార్సైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బందం ఆడియెన్స్తో స్పెషల్గా ఇంటరాక్ట్ అయ్యింది.
హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు గీత్ సైని, శాన్వి మేఘన, దర్శకుడు దామోదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని, నటుడు కిరీటి తదితరులు ప్రేక్షకులతో సరదాగా సినిమా గురించి ముచ్చటించారు. 'పుష్పక విమానం' సినిమా తమకు ఎంతగా నచ్చిందో టీమ్ సభ్యులకు ఆడియెన్స్ చెప్పారు. హాయిగా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజారు చేశామన్నారు.
ఈ సందర్భంగా కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, 'లాక్డౌన్ తర్వాత ఆడియెన్స్కు ఒక మంచి నవ్వించే సినిమా అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. మేం ఏదైతే అనుకున్నామో ఆ పర్సన్ నెరవేరింది. సినిమాని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అని చెప్పారు.
'మంచి కాన్సెప్ట్తో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని మా సినిమా మరోసారి నిరూపించింది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలు ఇటీవల కాలంలో రాలేదు. మా సినిమాని హిట్ చేసినందుకు థ్యాంక్స్' అని దర్శకుడు దామోదర తెలిపారు. కథానాయికలు శాన్వీ మేఘన, గీత్ సైని ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే ఈ సినిమాని చూస్తూ థియేటర్స్లో ఆడియెన్స్ ఎంతగా నవ్వుకున్నారో వీడియో క్లిప్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.