Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి 'ఈ రాతలే..' అంటూ సాగే పల్లవిగల పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని గీత రచయిత కృష్ణకాంత్ (కెకె) తన సంతోషాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు 450 చిత్రాలకు పాటలు రాశా. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓ ఛాలెంజింగ్గా తీసుకుని, పాటలను రాశా. 'రాధేశ్యామ్' సినిమాలోని 'ఈ రాతలే.. దోబూచులే..'పాటకు సర్వత్రా విశేష స్పందన లభించింది. కథలోని సందర్భానుసారం రాసిన ఈ పాటకు ఇంత ఆదరణ రావడం చాలా సంతోషంగా ఉంది. 1970 యూరప్ బ్యాక్డ్రాప్లో ఉండే కథ కాబట్టి, అందుకు తగ్గట్టే ఈ పాటలోని పదాలను రాశా. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్ ఈ పాటకు అత్యద్భుతంగా స్వరాలను సమకూర్చారు. ఈ పాటకి వస్తున్న స్పందన నేపథ్యంలో ప్రభాస్గారి కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతం ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇంత మంచి పాట ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణకు థ్యాంక్స్. ప్రస్తుతం 'శ్యామ్ సింగరారు', 'మేజర్', 'హిట్ 2', నాగార్జున 'ఘోస్ట్' చిత్రాలకు పాటలు రాస్తున్నా. ఏ పాట రాసినా అందరినీ అలరించాలనే లక్ష్యంతోనే రాస్తాను' అని తెలిపారు.