Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్జున్ కష్ణ, శోభితా రానా జంటగా రూపొందుతున్న చిత్రం 'మిస్సమ్మ'. శ్రీ వేంకటేశ్వర సాయి క్రియేషన్స్ పతాకంపై హరి అయినీడిి, రమ్య కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. అబి óరాజ్ రుపాల, సతీష్ వి.ఎమ్. అనే ఇద్దరు కొత్త డైరెక్టర్స్ ఈ చిత్రంతో పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద ఘనంగా జరిగింది.
హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మంత్రి తలసాని క్లాప్ కొట్టారు. నిర్మాత ఆరా మస్తాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, 'మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ హిట్ కావాలని కోరుకుంటున్నా. నా సన్నిహితుడు హరి అయినీడి సినిమా పరిశ్రమలో చాలా కష్టపడ్డాడు. పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేశాడు. సినిమాలపై ప్యాషన్ ఉన్న నిర్మాత, మంచి వ్యక్తి. అలాంటి హరి అయినీడికి ఈ సినిమా మంచి సక్సెస్ రావాలి' అని చెప్పారు.
'సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్, లైవ్లీ, లవ్లీ బిహేవియర్తో అలనాటి 'మిస్సమ్మ' ఆల్ టైమ్ క్లాసిక్గా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకుని సరికొత్త కథ, కథనాలతో చేస్తున్న ప్రయత్నమిది. సైంటిఫిక్, హిస్టారిక్ అంశాలతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోంది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో పాటు ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ కూడా ఉంది. బ్రిటీషర్స్ రాక ముందు ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకుని, ఆ విషయాలను ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్గా, థ్రిల్లింగ్గా ఓ యూనిక్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉండబోతోంది' అని నిర్మాత హరి అయినీడి తెలిపారు. దర్శకులు మాట్లాడుతూ, 'ఈ సినిమా మాస్, క్లాస్కు నచ్చే విధంగా రూపొందిస్తున్నాం. మమ్మల్ని, కథను నమ్మి ఈ సినిమా తీస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు' అని చెప్పారు.
'ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నాతో పాటు చిత్ర యూనిట్కి కూడా మంచి పేరు తెచ్చే సినిమా ఇది' అని కథానాయిక శోభిత రానా అన్నారు. బిగ్ బాస్ లహరి మాట్లాడుతూ, 'ఇంత మంచి సినిమాలో నేనూ నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు. 'నటుడిగా నాకు మంచి గుర్తింపు ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా తర్వాత హీరోగా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నా' అని హీరో అర్జున్ కష్ణ తెలిపారు.