Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్గౌడ, ప్రియాపాల్ జంటగా వి.జె.సాగర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సి.ఆర్.ప్రొడక్షన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా సి.రవి సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఆదివారం సారథి స్టూడియోలో సినీ రంగ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి.
హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి క్ల్లాప్ కొట్టగా, చిత్ర నిర్మాత రవి సాగర్ కెమెరా స్విచ్చాన్ చేేశారు. చిత్ర దర్శకుడు వి.జె.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, 'నువ్వు గొప్పగా కల కనక పోతే, ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు ...అనే డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఒక్క డైలాగ్ ఏ రేంజ్లో సినిమా ఉంటుందో చెబుతుంది' అని అన్నారు. 'నేచురల్ ఫార్మింగ్ చేస్తూ సి.ఆర్ అనే ఒక బ్రాండ్తో విషం లేనటువంటి మంచి ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నాను. అదే పంథాలో ఇప్పుడు సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉదేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. పిల్లల్ని మనం హాస్టల్లో జాయిన్ చేస్తున్నాం. కానీ విద్యతో పాటు వాళ్లు చాలా మిస్ అవుతున్నారు, దాని ప్రభావం కొంతకాలం తర్వాత ఓల్డ్ ఏజ్ హౌంగా రిఫ్లెక్షన్ అవుతుందనే కంటెంట్తో మంచి స్క్రీన్ ప్లేతో దర్శకుడు అద్భుతమైన కథను రాసుకున్నారు. ఈ సినిమాలోని ప్రతి సీన్లో కూడా ఒక నూతనత్వం ఉంది. ఫ్యామిలీతో కలిసి ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది' నిర్మాత సి. రవిసాగర్ తెలిపారు.
దర్శకుడు వి.జె. సాగర్ మాట్లాడుతూ,'దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు?, ఆ ప్రేమ మిస్ అయితే పెద్దయిన తర్వాత ఎలా తయారవుతారనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమాని చేస్తున్నాం. 'కేజియఫ్'కు సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్ వారే ఈ సినిమాకు పనిచేస్తున్నారు వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం' అని చెప్పారు.