Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వినోదభరిత చిత్రం 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాత.
ఈనెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం కథానాయిక కశిష్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం చేసిన ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేశారు. నా మొదటి చిత్రం అన్నపూర్ణ బ్యానర్లో రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసినందుకు సుప్రియ మేడంకు థ్యాంక్స్. పక్కింటి అమ్మాయిగా మంచి పాత్రలో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాను. డైరెక్టర్ శ్రీనుకు ఏం కావాలో అది బాగా తెలుసు. ఆయనకి క్లియర్ విజన్ ఉంది. ఇప్పటి వరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. 'నీ వల్లేరా..' అనే పాట నాకు చాలా ఇష్టం. కామెడీ, యాక్షన్, ఎమోషన్, లవ్ ఇలా అన్ని రకాల ఎమోషన్లు ఈ సినిమాలో ఉంటాయి. ఇందులోని ఎమోషనల్ సీన్స్ చేయడం నాకు చాలా కష్టమనిపించింది. తెలుగు భాష కూడా సవాల్గా మారింది. అయితే హీరో రాజ్తరుణ్ బాగా సపోర్ట్ చేయటంతో చాలా ఈజీ అయ్యింది. ఈ సినిమాలో నటించటం ఓ విశేషమైతే, నాగార్జునగారిని దగ్గరిగా చూడటం మరో విశేషంగా భావిస్తున్నా. ఆయన నా ముందున్నారు అనే ఫీలింగ్ చాలా గ్రేట్గా అనిపించింది. అలాగే సుప్రియ మేడమ్ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. హీరోల్లో రవితేజ అంటే చాలా ఇష్టం. అన్ని పాత్రల్ని పోషించే ఛాన్స్ నటీనటులకు మాత్రమే ఉంటుంది. అందుకే నేను యాక్టింగ్ని కెరీర్గా ఎంచుకున్నా' అని చెప్పారు.