Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అద్భుతం' సక్సెస్మీట్లో రాజశేఖర్, జీవిత
'మా కూతురు శివానీ నటించిన 'అద్భుతం' సినిమా విడుదలవ్వడం, ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం.. మాకెంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులుగా మేమెంతో గర్వపడుతున్నాం' అని రాజశేఖర్, జీవిత అన్నారు. తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా మల్లిక్రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అద్భుతం'. చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇటీవల డిస్నీప్లస్ హాట్స్టార్లో విడుదలైంది.
సినిమా చాలా బాగుంది అనే పాజిటివ్ టాక్తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం సోమవారం సక్సెస్మీట్ని గ్రాండ్గా నిర్వహించింది.
ఈ సందర్భంగా శివాజీ రాజశేఖర్ మాట్లాడుతూ, 'నేను సినిమాల్లోకి రావడానికి మా తల్లిదండ్రుల సపోర్ట్, వారి బ్యాక్గ్రౌండే కారణం. నాన్నగారి సినిమాలో తొలిసారి స్టూడెంట్గా నటించా. అది రిలీజ్ కాలేదు. ఆ తర్వాత 'టు స్టేట్స్' చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేశా. అదీ రిలీజ్ కాలేదు. పోనీ కోలీవుడ్లో నైనా అదృష్టం పరీక్షించుకుందామని అక్కడా సినిమా చేస్తే, అదీ రిలీజ్ కాలేదు. అయితే వీటన్నింటిని ఓవర్కమ్ చేస్తూ 'అద్భుతం' సినిమా నిజంగానే నా కెరీర్లో అద్భుతం చేసింది. ఆలస్యమైనా తొలి సినిమా హిట్ కావడం హ్యాపీగా ఉంది' అని చెప్పారు.
మేం ఊహించని విజయమిది. మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తాం అని ప్రేక్షకులు మరోసారి ఫ్రూ చేశారని దర్శక, నిర్మాతలన్నారు.