Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మించాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు శీను గవిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు పూరి జగన్నాథ్ స్ఫూర్తితోనే ఇండిస్టీకి వచ్చాను. 2016లో డైరెక్ట్ చేసి రెండు సినిమాలు అంతగా ఆడలేదు. అలాగే 'క్రాక్' సినిమాకు రైటర్గా పని చేశాను. బాలకష్ణ గారితో చేయబోతోన్న సినిమాలోనూ రైటర్గా పని చేస్తున్నాను. కథ, విలేజ్ సెటప్, ఎండింగ్లోని ఎమోషన్ బాగా నచ్చి, సుప్రియ గారు ఈ సినిమాని ఓకే చేశారు. తర్వాత నాగ చైతన్య, నాగార్జున కూడా కథ విని, వాళ్లకి కూడా నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. అన్నపూర్ణ బ్యానర్లో దర్శకుడిగా ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతీ మనిషిలోనూ ఓ అను భవించు రాజా ఉంటాడు. డబ్బు, అమ్మాయిలు, సినిమా.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్లో ఇష్టం ఉంటుంది. లైఫ్ చాలా చిన్నది.. ఉన్నప్పుడే ఎంజారు చేయాలనేది ఈ స్టోరీ. నిజంగా అనుభవించడం అంటే ఏంటి? అనేది చెప్పే ఎమోషనే ఈ సినిమా. సెక్యూరిటీ గార్డ్ నేపథ్యంలో కథ చెప్పడం రాజ్ తరుణ్కి కూడా బాగా నచ్చింది. ఇంత వరకు చెప్పని బ్యాక్గ్రౌండ్. ఒరిజినల్గా సెక్యూరిటీ క్యాంప్కు వెళ్లి అక్కడే చిత్రీకరణ చేశాం. భీమవరంలో ఓ నలభై రోజులు చేశాం. ఇందులో కర్లీ హెయిర్ అనే ట్రాక్ ఉంటుంది. అందుకే కశిష్ ఖాన్ను నాయికగా తీసుకున్నాం. ఈ సినిమాకి గోపీ సుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అజరు, నరేన్, అరియానా, రవికష్ణ ఇలా చాలా మంచి పాత్రలున్నాయి. ఈ సినిమా కోసం నేను ఎంతలా పని చేశానో, నిర్మాత సుప్రియ గారు కూడా అంతే పని చేశారు. అక్కగా, గురువుగా నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఈ సినిమాని నాగ చైతన్య చూసి, మెచ్చుకున్నారు. ఈనెల 26 నుంచి ఈ సినిమాతో సంక్రాంతి పండగ వచ్చినట్టేనని భావిస్తున్నాను' అని చెప్పారు.
ఇందులో కామెడీతో పాటు మంచి ఎమోషన్ ఉంది. మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదు. మనం పుట్టిందే మన ఊరు అనే ఎమోషన్ అందర్నీ కదిలిస్తుంది. ఫ్యామిలీతో వచ్చి హాయిగా నవ్వుకుని థియేటర్ నుంచి ఇంటికెళ్తూ ఓ ఎమోషన్ని మాత్రం కచ్చితంగా తీసుకెళ్తారని నమ్మకంగా చెప్పగలను.