Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్ హీరోగా, దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రిపబ్లిక్'. జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఈనెల 26 నుంచి దర్శకుడు దేవ్కట్టా కామెంటరీతో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రసాద్ ల్యాబ్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగపతి బాబు మాట్లాడుతూ,'''దేవాతో 'ప్రస్థానం', 'ఆటో నగర్ సూర్య' రెండూ మిస్ అయ్యాను. ఆ రెండూ మిస్ అయినా... 'రిపబ్లిక్'లో నటించినందుకు గర్వంగా ఉంది. భారతీయులు అందరూ గర్వపడే సినిమా ఇది. తొలిసారి దేవ్ కట్టా డైరెక్టర్స్ కామెంటరీతో ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు. ఇదొక వినూత్న ప్రయోగం. బోల్డ్ స్టెప్ కూడా' అని అన్నారు.
దర్శకుడు దేవ్ కట్టా మాట్లాడుతూ, 'మేం చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నాం. చిరంజీవిగారి 'రుద్రవీణ'లా ఈ సినిమా అవ్వాలనేది నా విజన్. చాలా మంది మళ్లీ 'రిపబ్లిక్' చూడాలని ఎదురుచూస్తున్నారు. అందుకే డైరెక్టర్ కామెంటరీ అనే ఐడియా వచ్చింది. రెండున్నర గంటలసేపు నా బందంతో స్క్రీన్ ప్లే సహా ప్రతి సీన్, షాట్ ఎలా?, ఎందుకు తీశామనేది వివరిస్తూనే, అందులో ఉన్న సవాళ్లను డిస్కస్ చేశాం. జీ 5 యాప్లో రెండు వెర్షన్స్ ఉంటాయి. ఒకటి 'రిపబ్లిక్' సినిమా. రెండోది 'రిపబ్లిక్' విత్ డైరెక్టర్స్ కామెంటరీ' అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు కంటెంట్, జీ స్టూడియోస్ ప్రసాద్ నిమ్మకాయల, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, జీ 5 లాయిడ్ గ్జేవియర్, 'రిపబ్లిక్' క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, రవి వర్మ పాల్గొన్నారు.
నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు థ్యాంక్స్. 'రిపబ్లిక్' సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. 'జీ 5' ఓటీటీలో ఈనెల 26న విడుదల అవుతోంది. సినిమా చూడండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
- హీరో సాయితేజ్