Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'దొరకునా ఇటువంటి సేవ'. ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్ అనేది ఉపశీర్షిక. రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామచంద్ర రాగిపిండి మాట్లాడుతూ, 'ఒక మంచి విషయాన్ని చెబుతూ మంచి సినిమా తీయడం చాలా సులభం. సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ, మంచి సినిమా తీయడం చాలా కష్టం. ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాల వల్ల జరిగే నేరాలు విపరీతంగా పెరిగాయి. ప్రతి పదిమందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. క్షణికానందం కోసం, ఎవరైనా అడ్డొస్తే చంపేస్తున్నారు. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్', 'గుంటూరు టాకీస్', 'ఆర్ఎక్స్ 100' సినిమాల తరహాలో, వాటికి భిన్నమైన కంటెంట్తో ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాని తెరకెక్కించాను' అని అన్నారు.
'ఎవరూ ధైర్యం చేయలేని కొత్త కథాంశాలను బోల్డ్గా, బ్యాలెన్స్డ్గా తెరకెక్కించి నప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నప్పుడు పెద్ద సినిమాల మధ్య వచ్చినా విజయం అందిస్తారని డిసెంబర్ 10న మా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని నిర్మాత దేవ్ మహేశ్వరం చెప్పారు.