Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దశ్యం 2'. ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ 'దశ్యం' చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్లో డైరెక్ట్గా విడుదలైంది. సక్సెస్ సాధించిన ఈ సినిమా గురించి నిర్మాత సురేష్ బాబు శనివారం మీడియాతో మాట్లాడారు.
''దశ్యం 2' మళయాలంలో మంచి హిట్ అయింది. వెంటనే రైట్స్ తీసుకున్నాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా అందర్నీ బాగా అలరిస్తోంది. ఓటీటీ అనేది ఫైనాన్షియల్గా సేఫ్ అవుతుంది. అందుకే దీన్ని అమోజాన్లో రిలీజ్ చేశాం. ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్ మారిపోతోంది. 'అఖండ', 'పుష్ప' వంటి చిత్రాలకు ఆడియెన్స్ కచ్చితంగా థియేటర్లకు వస్తారు. పండుగలకు జనాలు థియేటర్లకు వస్తున్నారని అందరికీ అర్థమైంది. దీంతో ఫెస్టివల్ సీజన్కు రావాలని దర్శక, నిర్మాతలు ఫి˜ిక్స్ అయ్యారు. ఒకప్పుడు సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చేవి. ఒక్కొక్క సినిమా నాలుగు వందల థియేటర్ల చొప్పున విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 1500 స్క్రీన్స్ కావాలని అంటున్నారు. దీంతో గొడవలు జరుగుతున్నాయి. మరి..ఈ సంక్రాంతికి ఎలా ఉంటుందో చూడాలి.
ప్రస్తుతం 'శాకిని డాకిని', 'దొంగలున్నారు జాగ్రత్త', 'డ్యాన్సింగ్ క్వీన్' అనే మూడు సినిమాలు ఓటీటీకి ఇచ్చేశాను. వెంకటేష్ హీరోగా 'రానా నాయుడు', 'ఎఫ్ 3'లు కాకుండా ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. అవి రివిల్ చేశాక తప్పకుండా మీరు సర్ప్రైజ్ అవుతారు.
'విరాటపర్వం' ఇంకా ఐదు రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు' అని సురేష్బాబు చెప్పారు.
మరీ అంత తక్కువ రేట్లా..?
ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా 'దృశ్యం 2'ని ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 అది చాలా నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరుగుతోందని పిస్తోంది. మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమనేది కూడా కరెక్ట్ కాదు. ఓ ప్రోడక్ట్ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది.
ఈ 15 నెలల్లో మాకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ అనే వాటిని డబ్బుతో కొలవొద్దు. మన హైదరాబాద్ని దేేశానికి సినీ రాజధాని చేసే విధంగా కేటీఆర్గారు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో ఎక్కవ సబ్సిడీ ఇవ్వడానికి, యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఇండిస్టీ కోసం ట్రై చేయటానికి కారణం ఒక్కటే సినిమా వల్ల టూరిజం పెరుగుతుంది. డెవలప్మెంట్ జరుగుతుంది.