Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తండ్రీతనయులు చిరంజీవి, రామ్చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆచార్య'.
శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. ఇందులో ఆచార్యగా చిరంజీవి నటిస్తుంటే, సిద్ధ అనే పవర్ఫుల్ పాత్రని రామ్చరణ్ పోషించారు. ఆదివారం సిద్ధ క్యారెక్టర్కు సంబంధించిన టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'ఇందులో సిద్ధ(రామ్ చరణ్) ధర్మస్థలిలో ఉంటూ అక్కడ దేవాలయానికి, అక్కడున్న ఇతరులకు అండగా ఉంటాడు అనే పాయింట్ను ఎలివేట్ చేస్తూనే సిద్ధకు, నీలాంబరి మధ్య ప్రేమను కూడా చక్కగా దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. అదే సిద్ధ అన్యాయానికి ఎదురు తిరిగినప్పుడు ఎలా ఉంటాడు?, నక్సలైట్ నాయకుడిగా ఎలా ఉంటాడు అనే అంశాలను కూడా ఈ టీజర్లో చూపించారు. 'ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది' అని సిద్ధ విలన్స్ను ఉద్దేశించి చెప్పే డైలాగ్ వింటుంటే పాత్రలోని ఇన్టెన్సిటీ అర్థమవుతుంది. ఇక టీజర్ చివరలో నీటి కొలను ఒక వైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే, పెద్ద చిరుత కాపాలాగా ఉంటుంది. అదే కొలనుకి మరో వైపు రామ్చరణ్ నీళ్లు తాగుతుంటే, చిరంజీవి నిలబడి చూస్తుండటాన్ని చూపించి డైరెక్టర్గా తనేంటో, మాస్ పల్స్ను ఎలా పట్టగలనో నిరూపించారు కొరటాల శివ. ఇటు ప్రేక్షకులకు, అటు మెగాభిమానుల అంచనాలను మించేలా సినిమా ఉంటుందని టీజర్ చెప్పకనే చెప్పిందని చిత్ర బృందం తెలిపింది.
ఈ సందర్భంగా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, 'టీజర్ చూస్తుంటే గూజ్ బమ్స్ వస్తుందని అందరూ అంటున్నారు. కొరటాల శివగారు ఇటు చిరంజీవిని, అటు రామ్చరణ్ పాత్రని ఎంత పవర్ఫుల్గా, ఇన్టెన్స్తో డిజైన్ చేశారో టీజర్లో తెలిసిపోతుందని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్కు, లాహే లాహే సాంగ్.., నీలాంబరి సాంగ్స్కు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.