Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం 'నయీం డైరీస్'. దాము బాలాజీ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో వశిష్ట సింహ లీడ్ రోల్ చేశారు. సీఏ వరదరాజు నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 10న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సీఏ వరదరాజు మాట్లాడుతూ,'నయీం కథ వినగానే యాక్షన్ బ్యాక్డ్రాప్లో బాగుంటుందని చేశాం. వశిష్ట సింహ నటన సినిమాకి హైలెట్గా ఉంటుంది. మేం అనుకున్న దాని కంటే బాగా యాక్ట్ చేశారు. ఈ నెల 10న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అని తెలిపారు.
'రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనే దాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్కౌంటర్ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యాయనం చేశాను. తను అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నేనూ విప్లవ కారుడుగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నాను. ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో నేను ప్రత్యక్షంగా చూశాను. వాటినీ డ్రమటిక్గా ఈ సినిమాలో చూపించాను. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా వర్గాల నుంచే కాకుండా సమాజంలోని విభిన్న వర్గాల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది' అని దర్శకుడు దాము బాలాజీ చెప్పారు.
యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్, సంగీతం : అరుణ్ ప్రభాకర్, ఎడిటర్ : కిషోర్ మద్దాలి, రచన-దర్శకత్వం దాము బాలాజీ.