Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్'. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమాలోని 'నగుమోము తారలే..'
అంటూ సాగే పాట విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన లభించడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'సిద్ శ్రీరామ్ పాడగా, జస్టిన్ ప్రభాకరన్ ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ప్రస్తుత ఈ సాంగ్ వైరల్ అయ్యింది. ఈ పాటలో ప్రభాస్, పూజాహెగ్డే ఇద్దరూ చాలా రొమాంటిక్గా కనిపిస్తున్నారు. సముద్ర తీరంలో ఈ పాట చాలా రిచ్గా కనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బందం అంతా కలిసి సౌత్, నార్త్ వెర్షన్స్కు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక సినిమాకు ఒకేసారి రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ మంచి ప్లానింగ్తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. జనవరి 14, 2022న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని అన్నారు.